Рет қаралды 505,305
పొద్దు,పొద్దున్నే లభించే బిర్యానీలకు ప్రొద్దుటూరు ప్రసిద్ధి.
ఇక్కడ దశాబ్దాలుగా వేకువనే రుచికరమైన బిర్యానీలు వడ్డిస్తున్నారు వివిధ ఆహారశాలల వారు.
అట్టి జాబితాలో ప్రముఖమైన గౌస్ మటన్ బిర్యానీని నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
స్వయం ఉపాధి నిమిత్తం 10 ఏళ్ల క్రితం మహ్మద్ గౌస్ గారు బిర్యానీ కేంద్రాన్ని ప్రారంభించి శుచి-రుచితో నాణ్యత నిండి ఉన్న ఆహారం వండి వడ్డిస్తూ ప్రొద్దుటూరులో గుర్తింపు పొందారు.
నిశిత పరిశీలనతో వంటకం రూపు దాల్చుతారు గౌస్ గారు. ప్రాధమికంగా నాణ్యమైన బియ్యం, మేలైన పొట్టేలు కూర ఎంపికలో జాగ్రత్త వహిస్తారు కీలకం అవే కనుక .దరిమిల వినియోగిస్తున్న మసాలా దినుసుల స్వభావం అనుభవం రీత్యా పూర్తిగా తెలిసి ఉండటం, ప్రాముఖ్యంగా ఎప్పుడు ఏ పదార్ధం,ఏలా సమ్మిళితం చేయాలన్న వారి శ్రేష్ఠత కారణంగా వారు అందిస్తున్న బిర్యానీ ఉప్పు కారాల ప్రభావం, మసాలా మంటా లేకుండా అన్ని సమతూకంతో ఉండి తృప్తికర ఇష్టతను వ్యక్తం చేయువిధంగా ఉంది.ప్రత్యేకంగా చెప్పాలంటే మసాలా గుజ్జు భలే
రుచిగా ఉంటుంది.
ఇక అనుభూతి పొందుతూ ఆస్వాధిస్తే
రవ్వంత పులుపు అంతే కారంతో ఉన్న గొంగూరతో బిర్యానీ పొందిక పరిచి నోటికి అందిస్తే అమోఘమైన రుచి నాలుకపై అవహిల్లుతుంది.
తదుపరి
పొట్టేలు కూర పులుసు తో మిళితం చేసి ముక్కను బిర్యానీలో ఉంచి తింటే పసందైన రుచి కంఠనాళం గుండా ప్రవహించిననట్లే.అంతిమంగా పెరుగు పులుసుతో తింటే కమ్మని విరమణ మనకు లభిస్తుంది.
చిరునామా :- g.co/kgs/mqR1Vw