Рет қаралды 2,208
#rampandunews #templesofindia #trending #treditional #village #ayodhyarammandir #telangana
అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ద్వారా తలంబ్రాలు రామ భక్తుల కోలాహలం నడుమ చేరుకున్నాయి.
అయోధ్య రామ మందిరం నుండి తీసుకువచ్చిన తలంబ్రాలు గ్రామంలో కోలాట కళాబృందం, శ్రీ వెంకటేశ్వర భజన నాట్యమండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ గ్రామంలో ఊరేగించారు.అనంతరం తలంబ్రాలను గ్రామంలోని శ్రీ రంగనాయకుల స్వామి దేవాలయంలో నిల్వచేసి,వచ్చే నెల రెండు నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని రామ భక్తులు తెలియజేశారు.
చాలా ఏళ్ల తర్వాత గ్రామంలో చిరుతల రామాయణం కళాబృందం వారు ఆనాటి రాముని పాటలు పాడుతూ నృత్యాలు చేయడంతో గ్రామస్తులు ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు.
శ్రీరాముని తలంబ్రాల ఊరేగింపు సందర్భంగా ఆజాద్ హింద్ యువ ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో భారీగా ఏర్పాటు చేశారు.
ఈ ర్యాలీలో బిజెపి నాయకులు,కార్యకర్తలు,రామ భక్తులు,కోలాట మహిళ బృందాలు,గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.