Рет қаралды 2,330
వరి సాగులో పెట్టుబడి ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. ఈ మధ్యన ప్రకృతి వైపరీత్యాలు , తెగుళ్లతో దిగుబడులు కూడా అంతంత మాత్రమే వస్తుండంతో రైతుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ క్రమంలో వరి సాగులో పెట్టుబడులు తగ్గించుకునే పద్ధతులను వ్యవసాయశాఖ రాష్ట్ర రైతులకు పరిచయం చేస్తోంది. వెద జల్లే పద్ధతిలో వరి సాగు చేయడం చక్కటి మార్గమని సూచిస్తోంది. ఇప్పటికే పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత కొనేళ్లుగా రైతులు ఈ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోనూ వెద్ద జల్లె పద్ధతిని విస్తృతం చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు . ఈ విధానంపై క్షేత్రస్థాయిలో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------