Рет қаралды 15,152
#educationsystem #jayaprakashnarayana #education #loksatta
మన విద్యావ్యవస్థలో పిల్లల్ని అణచివేసే, నిరాశపరిచే ఒత్తిడి తప్ప వాళ్ల శక్తిసామర్థ్యాలను వెలికి తీసే, సమాజానికి పనికొచ్చేలా చేసే సానుకూల ఒత్తిడి లేదని, దీని వల్ల ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ నిరుద్యోగం అనే పరిస్థితి ఏర్పడిందని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Nationalist Hub దిక్సూచి ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.
భారత్ లో పరీక్షల పధ్ధతి, ఐఐటీల్లో సీట్ల కోసం పోటీ, కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్, వైద్య విద్య తీరు, కంప్యూటర్ సైన్స్ - ఉత్పత్తి రంగం, జాతీయ విద్యా విధానం, భవిష్యత్తులో ఉపాధికి కోర్సులు ఎలా ఉండాలి, మేధో వలస, తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచనలు, యువతలో సామాజిక దృష్టి తగ్గిందా మొదలైన అంశాలపై JP స్పష్టతనిచ్చారు.