Рет қаралды 85,037
అందరికీ నమస్కారం🙏🤗.ఈ వీడియో లో చూపించిన రైతు పేరు అశ్విన్(9542009522). అతను తనకున్న వ్యవసాయ భూమి లో కొంత భాగంలో ప్రకృతి విధానం లో బ్లాక్ రైస్ పండించారు. ఆ బియ్యాన్ని అమ్మదలచినపుడు తన కష్టానికి తగిన ధర రాకపోవడంతో అమ్మకుండా తన వద్దనే ఉంచుకున్నారు.ఆయన తండ్రి "నేను వద్దంటే విన్నావా? అనవసరంగా పండించావు.ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు"అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశారట. ఎలా అయినా తను పండించిన ఆ బ్లాక్ రైస్ ను తగిన ధరకు అమ్మి తన తండ్రికి ఇలా పండించినా కూడా మనం లాభాలు పొందవచ్చు అని నమ్మకం కలిగించాలి అని ఆ యువ రైతు తపన పడుతున్నారు.కావున దయచేసి కొనగలిగిన వారు ఆ బియ్యాన్ని కొని ఆ రైతుకు మీ మద్దతును అందించగలరు.మీరు ఇచ్చే ఆ మద్దతు ఆ రైతులో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.ఇంకొంతమంది రైతులకి ఆదర్శం అవుతుంది.రైతు తను పండించిన పంటను మధ్యలో ఎవరికీ అమ్మకుండా నేరుగా అమ్ముకోగలిగినప్పుడే రాజు కాగలుగుతారు లేదంటే కేవలం రైతే రాజు అన్న నినాదాలకే పరిమితం అవుతాడు.మంచి మనసుతో మీరందరు అతనిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.🙏🤗