Рет қаралды 1,557
అనంతపురం జిల్లాలో 30 మండలాల రైతులకు వాతావరణ బీమా పరిహారం ఎందుకు రాలేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయినా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు రైతుల పేర్లు నమోదు చేయలేదంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పంట నమోదు చేయకుండా అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం రాకుండా చేశారని ఆరోపించారు. తమ విజ్ఞప్తి మేరకు వ్యవసాయ కమిషనర్ జిల్లాలో వర్షాలతో పంట నష్టపోయిన జాబితా మరోసారి పంపాలని ఆదేశించినా.. అధికారులు పట్టించుకోలేదంటూ జేడీని నిలదీశారు. అనంతపురం జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటి సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ పనితీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------