Рет қаралды 1,493
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పప్పు శనగ సాగుకు పెట్టింది పేరు. అత్యధికంగా నల్లరేగడి నేలలు ఉండటంతో ఏళ్లుగా పప్పు శనగను సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు అందివస్తుండటంతో రైతుకు మంచి ఆదాయం దక్కేది..అయితే రానురాను పప్పు శనగ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత మూడేళ్లుగా పప్పుశనగ సాగు నామమాత్రంగా సాగుతోంది. గతంలో సుమారు 20 నుంచి 30 వేల ఎకరాల్లో సాగయ్యే పప్పు శనగ ప్రస్తుతం 10 వేల ఎకరాలు కూడా మించడం లేదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు చీడపీడల ఉధృతి పెరగడం, ప్రభుత్వ మద్దతు ధరలు గిట్టుబాటు కాకపోవడమే ఇందుకు కారణమని రైతులు వాపోతున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------